క్రీడాభూమి

సెమీస్‌కు ప్లిస్కోవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్: ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా ఇండియన్ వెల్స్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె గార్బినె ముగురుజాను 7-6, 7-6 తేడాతో ఓడించింది. మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకూ ఉత్కంఠ రేపింది. ముగురుజా నుంచి ఎదురైన పోటీని సమర్థంగా ఎదుర్కొన్న ప్లిస్కోవా రెండు సెట్లలోనూ చివరి పాయింట్లు సాధించడానికి శ్రమించాల్సి వచ్చింది. మరో మ్యాచ్‌లో అనస్తాసియా పవ్లిచెన్కొవాను 6-3, 6-3 తేడాతో ఓడించిన స్వెత్లానా గుజ్నెత్సొవా కూడా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. మొదటి క్వార్టర్ ఫైనల్ హోరాహోరీగా సాగితే, రెండో క్వార్టర్ ఫైనల్ ఏకపక్షంగా ముగిసింది. ఇలావుంటే, ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ గాయం కారణంగా వైదొలగడంతో మహిళల విభాగంలోనూ టైటిల్ ఎవరిదో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

చిత్రం..కరోలినా ప్లిస్కోవా