క్రీడాభూమి

ధోనీ బృందం బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: విజయ్ హజారే ట్రోఫీలో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఆడుతున్న జార్ఖండ్ క్రికెట్ జట్టు బస చేసిన ద్వారకా హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అధికారులు వెంటనే స్పందించడంతో, ఆటగాళ్లు క్షేమంగా బయటపడ్డారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా ఈ టోర్నమెంట్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం సుమారు ఏడు గంటల ప్రాంతంలో హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని, ఏడో అంతస్తులో ఉన్న తమను బయటకు రావద్దని తొలుత హోటల్ అధికారులు సూచించారని జార్ఖండ్ బ్యాట్స్‌మన్ ఇశాంక్ జగ్గీ పిటిఐకి చెప్పాడు. అయితే, కొద్దిసేపటికే తమను హోటల్ గదులు ఖాళీ చేయాల్సిందిగా కోరారని, అప్పటికే దట్టమైన పొగ వ్యాపించిందని అన్నాడు. మెట్లమీదుగా తాము కిందకు దిగామని తెలిపాడు. కాగా, ఆటగాళ్లను హోటల్ నుంచి నేరుగా పాలెం క్రికెట్ మైదానం వద్దకు తీసుకెళ్లిన అధికారులు అక్కడ వారికి తాత్కాలిక బసను ఏర్పాటు చేశారు. కాగా, జార్ఖండ్, బెంగాల్ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ని నిర్వాహకులు శనివారానికి వాయిదా వేశారు. అదే విధంగా ఆదివారం నాటి ఫైనల్ సోమవారం జరుగుతుందని ప్రకటించారు.