క్రీడాభూమి

క్వార్టర్స్‌లో ప్రణయ్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బసెల్ (స్విట్జర్లాండ్), మార్చి 18: స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ ఓటమి పాలయ్యాడు. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన అతన్ని చైనా ఆటగాడు షి యుక్వి 21-19, 21-11 తేడాతో ఓడించాడు. నిరుడు ఆసియా టీం చాంపియన్‌షిప్స్‌లో షి యుకీని ఓడించిన ప్రణయ్.. ఈసారి మాత్రం రాణించలేకపోయాడు. కాగా, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలోనూ భారత్‌కు చుక్కెదురైంది. ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి జోడీ 19-21, 17-21 తేడాతో జాంగ్ నాన్, లి ఇన్‌హుయ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది.