క్రీడాభూమి

పార్లమెంటు ఆవరణలో ఫుట్‌బాల్ సందడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: పార్లమెంటు ఆవరణలో బుధవారం ఫుట్‌బాల్ సందడి కనిపించింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్, జాతీయ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ , పలువురు పార్లమెంటు సభ్యులు సరదాగా ఫుట్‌బాల్‌లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఏడాది జరిగే ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని, దేశ వ్యాప్తంగా చిన్నారులకు ఫుట్‌బాల్‌పై అవగాహన పెంచే కార్యక్రమాన్ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ చేపట్టింది. అందులో భాగంగానే బుధవారం పార్లమెంటు ఆవరణలో మంత్రి గోయల్ తదితరులు ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించారు.
స్పీకర్‌కు ఫుట్‌బాల్ బహుమతి
రాజకీయ నాయకుడిగా మారిన ఫుట్‌బాల్ ఆటగాడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి ప్రసూన్ బెనర్జీ ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఓ ఫుట్‌బాల్‌ను, ఒక జ్ఞాపికను బహుమతిగా ఇచ్చాడు. భారత ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ అయిన బెనర్జీ సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ను కలిసి తన బహుమతిని అందించాడు.

పార్లమెంటు ఆవరణలో బుధవారం ఫుట్‌బాల్ ఆడుతున్న
బిజెపి ఎంపి రూపా గంగూలీ