క్రీడాభూమి

సిఒఎ పర్యవేక్షణలో నేడు ఐపిఎల్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: సుప్రీం కోర్టు నియమించిన పాలక కమిటీ (సిఒఎ) పర్యవేక్షణలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పాలక వర్గం గురువారం సమావేశం కానుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వ్యవహారాల్లో ప్రస్తుతం అన్ని అధికారాలు సిఒఎకు ఉన్నాయి. దీనితో ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. సిఒఎ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇదే మొదటి ఐపిఎల్ పాలక మండలి సమావేశం కావడంతో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇలావుంటే, ఐపిఎల్ ఈవెంట్స్‌ను నిర్వహించేందుకు టెండర్లను బిసిసిఐ ఇది వరకే ఆహ్వానించింది. గురువారం నాటి సమావేశంలో బిడ్‌ను పొందిన సంస్థ పేరును ప్రకటించే అవకాశం ఉంది.