క్రీడాభూమి

తమిళనాడు ఖాతాలో మరో టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మార్చి 29: కీలకమైన ఫైనల్ పోటీలో దినేష్ కార్తీక్ చెలరేగిపోయాడు. అతను సెంచరీ చేయడంతో, ఇండియా ‘బి’పై తన జట్టు విజయం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఈ విజయంతో తమిళనాడు దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుని ఈ పోటీలకు తమిళనాడు అర్హత సంపాదించింది. అది ఆషామాషిగా లభించిన విజయం కాదని నిరూపిస్తూ, పటిష్టమైన ఇండియా ‘ఎ’, ఇండియా ‘బి’ జట్లను ఓడించి ఈ ట్రోఫీని గెల్చుకుంది. బుధవారం నాటి మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 42 పరుగుల తేడాతో ఇండియా ‘బి’ జట్టును ఓడించి, లీగ్ దశలో అదే జట్టు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అంతకు ముందు, ఇండియా ‘ఎ’ జట్టుపై 93 పరుగులు చేసి ఫాంలోకి వచ్చిన దినేష్‌కార్తీక్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయి, ఇండియా ‘బి’ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అన్ని లీగ్ మ్యాచుల్లో బ్యాటింగులో అద్వితీయమైన ప్రతిభ కనబరిచిన ఇండియా ‘బి’ జట్టు ఈ మ్యాచ్‌లో మాత్రం వెలవెలబోవడం గమనార్హం. జట్టులో గురుకీరత్‌మాన్ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో తమిళనాడు ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 303 పరుగులు చేసింది. ఆట ప్రారంభంలో ధవళ్ కులకర్ణి బౌలింగులో 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును జగదీషన్, దినేష్ కార్తీక్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 133 పరుగులు జత చేశారు. జగదీషన్ 4 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విజయశంకర్ (21), ఇంద్రజిత్ (31) కార్తీక్‌కు అండగా నిలబడడంతో స్కోరు బోర్డును పరుగులు తీయించారు. దినేష్ కార్తీక్ 125 నిముషాల పాటు క్రీజులో నిలిచి 14 బౌండరీలు, 3 సిక్సర్లతో 126 పరుగులు చేశాడు. ఇండియా ‘బి’ జట్టు బౌలర్లలో ధవళ్ కులకర్ణి 39 పరుగులకు 5 వికెట్లు పడగొట్టగా, అశోక్ దిండా, చామా మిలింద్, అక్షర్ పటేల్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా తలా ఒక్కో వికెట్ తీసుకున్నారు. అనంతరం 304 పరుగుల భారీ స్కోరు లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన ఇండియా ‘బి’ 46.1 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటయింది. జట్టులో గుర్‌కీరత్ మాన్ 64, శిఖర్ ధావన్ 45, మనీష్ పాండే 32, హర్‌ప్రీత్ సింగ్ భాటియా 36, కార్నెవార్ 29 తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ ప్రత్యిర్థి బౌలర్లకు ఎదురు నిలవలేకపోయారు. తమిళనాడు బౌలర్లలో రాహిల్‌షా 3, మహ్మద్, సాయి కిశోర్ చెరో 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

చిత్రం..దేవధర్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ ‘బి’ని ఓడించి, గెల్చుకున్న షీల్డ్‌తో తమిళనాడు జట్టు