క్రీడాభూమి
ఆర్సిబి సహచరులతో కోహ్లీ ముచ్చట్లు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బెంగళూరు, ఏప్రిల్ 3: భుజం గాయం కారణంగా ఈసారి ఐపిఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) జట్టులోని తన సహచరులను కలిశాడు. వారితో ముచ్చటించాడు. క్రిస్ గేల్ తదితరులను ప్రత్యేకంగా పలకరించాడు. కోహ్నీ ఫిట్నెస్పై ఈనెల రెండో వారంలో నిర్ణయం తీసుకుంటామని బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఆర్సిబి ఈనెల 5వ తేదీన మొదటి మ్యాచ్ని సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడుతుంది. కోహ్లీ అందుబాటులో లేని కారణంగా, అతని స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్ ఎబి డివిలియర్స్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. అయితే, గాయం కారణంగా స్వదేశంలోని వనే్డ టోర్నీలో పాల్గొనలేకపోయిన డివిలియర్స్ ఐపిఎల్లో ఆడతాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ లోకేష్ రాహుల్ గాయం కారణంగా ఈసారి ఐపిఎల్కు దూరం కావడం కూడా ఆర్సిబిని వేధిస్తున్నది.