క్రీడాభూమి

డైబలా ‘డబుల్’ బార్సిలోనాపై జువెంటాస్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్యూరిన్ (ఇటలీ), ఏప్రిల్ 12: చాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్ మొదటి లెగ్ పోటీలో పటిష్టమైన బార్సిలోనాకు జవెంటాస్ షాకిచ్చింది. ఫార్వర్డ్ ఆటగాడు పాబ్లో డైబలా రెండు గోల్స్ చేయడంతో, జువెంటాస్ 3-0 తేడాతో బార్సిలోనాపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. లియోనెల్ మెస్సీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న బార్సిలోనాను మ్యాచ్ ఆరంభం నుంచే ఆత్మరక్షణలో పడేసిన జువెంటాస్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది. ఏడో నిమిషంలోనే తొలి గోల్ చేసిన డైబలా మరో 15 నిమిషాల తర్వాత రెండో గోల్‌ను అందించాడు. ఆతర్వాత జువెంటాస్ డిఫెన్స్‌కు పరిమితంకాగా, గోల్స్ కోసం బార్సిలోనా ముమ్మర ప్రయత్నాలు చేసింది. కానీ, జువెంటాస్ రక్షణ వలయాన్ని ఛేదించలేక నీరసపడింది. మ్యాచ్ 55వ నిమిషంలో జార్జియో చియెలినీ గోల్ సాధించాడు. 3-0 ఆధిక్యాన్ని సంపాదించిన జువెంటాస్ అదే స్కోరుతో మ్యాచ్‌ని ముగించింది.

సింగపూర్ ఓపెన్
సింధు బోణీ
సింగపూర్, ఏప్రిల్ 12: భారత స్టార్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు ఇక్కడ జరుగుతున్న సింగపూర్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. మొదటి రౌండ్‌లో ఆమె జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరాను 10-21, 21-15, 22-20 తేడాతో ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 17-21, 21-7, 21-19 పాయింట్ల ఆధిక్యంతో డెన్మార్క్ ఆటగాడు ఎమిల్ హోస్ట్‌పై విజయం సాధించాడు. అశ్వినీ పొనప్ప, సిక్కీరెడ్డి జోడీ 21-19, 21-19 తేడాతో ఇన్ లూ లిమ్, యాద్ చెంగ్ వెన్‌ను ఓడించి మహిళల డబుల్స్‌లో రెండో రౌండ్ చేరారు.