క్రీడాభూమి

పేద పిల్లలకు పండగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఎలాంటి అవకాశాలకూ నోచుకోని ముంబయిలోని 18 వేల మంది పేద పిల్లలు ఆదివారం పండుగ జరుపుకొన్నారు. గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌ని ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం పేద పిల్లల కోసం కేటాయించింది. దీనితో స్టాండ్స్ మొత్తం నీలం రంగుతో నిండిపోయాయి. పిల్లలంతా ముంబయి ఇండియన్స్ జెర్సీలు ధరించడంతో అరేబియా సముద్రం వాంఖడే స్టేడియానికి తరలివచ్చిందా అన్నంతగా నీలం రంగును సంతరించుకుంది. ‘అందరికీ విద్య’ అనే నినాదంతో ముంబయి ఇండియన్స్ యజమానీ నీతా అంబానీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐపిఎల్ మ్యాచ్‌ని పేద పిల్లల కోసమే కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.