క్రీడాభూమి

తాయ్ జూ ఇంగ్‌కు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్: మహిళల సింగిల్స్‌లో భారత ఆశాకిరణం పివి సింధును ఓడించిన ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలినా మారిన్‌కు ఫైనల్‌లో చుక్కెదురైంది. ప్రస్తుతం నాలుగో ర్యాంక్‌లో ఉన్న ఈమె ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్ చేతిలో 15-21, 15-21 తేడాతో వరుస సెట్లలో పరాజయాన్ని ఎదుర్కొంది. మహిళల డబుల్స్ విభాగంలో కమిల్లా రైటర్ జూ, క్రిస్టినా పెడెర్సన్ జోడీ టైటిల్ అందుకుంది. వీరు ఫైనల్‌లో మిసాకీ మత్సుమొటో, అయాకా తకహషి జోడీని 21-18, 14-21, 21-15 తేడాతో ఓడించి, విన్నర్స్ ట్రోఫీని స్వీకరించారు. ఇక మిక్స్ డబుల్స్‌లో లు కాయ్, హువాంగ్ యక్వియాంగ్ జోడీకి టైటిల్ లభించింది. ఫైనల్‌లో డెచపొల్ పవటనుకో, సస్పిసిరీ తయెకరాట్టనచాయ్ జోడీపై వీరు 19-21, 21-16, 21-11 ఆధిక్యంతో విజయం సాధించారు.

చిత్రం..తాయ్ జూ ఇంగ్