క్రీడాభూమి

ఆసియా రెజ్లింగ్‌లో ముగ్గురికి రజతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ముగ్గురు భారతీయులకు రజత పతకాలు దక్కాయి. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ (60 కిలోలు), వినేష్ ఫొగట్ (55 కిలోలు), దివ్య కక్రాన్ (69 కిలోలు) తమతమ విభాగాల్లో టైటిల్ ఫైట్స్‌ను కోల్పోయి రజత పతకాలతో సంతృప్తి చెందారు. 48 కిలోల విభాగంలో రీతూ ఫొగత్ సెమీస్‌లో ఓటమిపాలై కాంస్య పతకాన్ని అందుకుంది. జపాన్ రెజ్లర్ రిసాకో రవాయ్‌తో తలపడిన సాక్షి గొప్పగా పోరాడలేకపోయింది. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన రవాయ్ కేవలం రెండున్నర నిమిషాల్లోనే సాక్షిని చిత్తుచేసింది. వినేష్ కూడా జపాన్‌కే చెందిన సయే నంజో చేతిలో ఓటమిపాలైంది. రియోలో 69 కిలోల విభాగంలో స్వర్ణాన్ని అందుకున్న సారా డొషో చేతిలో దివ్య పరాజయాన్ని ఎదుర్కొంది. రీతూను యుయ్ సుసాకీ సులభంగా ఓడించి ఫైనల్ చేరింది. నిబంధనల ప్రకారం సెమీలో ఓడినందుకు ఆమెకు కాంస్య పతకాన్ని అందుకుంది.