క్రీడాభూమి

సెమీస్‌కు శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూన్ 23: ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్స్ చేరాడు. మహిళల విభాగంలో భారత్‌చు చుక్కెదురైంది. హైదరాబాదీలు పివి సింధు, సైనా నెహ్వాల్ తమతమ ప్రత్యర్థుల చేతిలో పరాజయాలను చవిచూసి నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకాంత్ తన సహచరుడు సాయి ప్రణీత్‌ను 25-23, 21-17 తేడాతో ఓడించి, సెమీస్ పోరును షి యుకీతో ఖాయం చేసుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్‌లో షి యుకీ 21-17, 21-12 ఆధిక్యంతో హన్స్ క్రిస్టియన్ విటింగస్‌పై విజయం సాధించాడు. రెండో సెమీ ఫైనల్‌లో చెన్ లాంగ్, లీ హ్యునిల్ ఢీ కొంటారు.
మహిళల సింగిల్స్‌లో సింధును తాయ్ జూ ఇంగ్ 10-21, 22-20, 21-16 తేడాతో ఓడించింది. మరో క్వార్టర్స్‌లో సైనాపై సన్ యూ 21-17, 10-21, 21-17 స్కోరుతో విజయం సాధించింది.