క్రీడాభూమి

హ్యున్‌పై కశ్యప్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాహెమ్ (అమెరికా), జూలై 20: యుఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ లీ హ్యున్‌పై భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్న హ్యున్‌ను అతను 21-16, 10-21, 21-19 తేడాతో ఓడించి రెండో రౌండ్ చేరాడు. భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత కశ్యప్ మళ్లీ చక్కటి ఫామ్‌ను ప్రదర్శించడం అభిమానులకు ఊరటనిచ్చింది. కాగా, ఐదో సీడ్ సమీర్ వర్మ మొదటి రౌండ్‌లో వియత్నాం ఆటగాడు హొవాంగ్ నమ్ గుయెన్‌ను 21-15, 21-10 తేడాతో ఓడించి రెండో రౌండ్ చేరాడు. రెండో సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా మొదటి రౌండ్‌ను సమర్థంగా పూర్తి చేశాడు. అతను 21-13, 21-9 ఆధిక్యంతో మెక్సికో ఆటగాడు అర్టురో హెర్నాండెజ్‌పై విజయం సాధించాడు.

చిత్రం.. పారుపల్లి కశ్యప్