క్రీడాభూమి

సెమీస్ చేరిన కశ్యప్, ప్రణయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనాహెమ్ (అమెరికా), జూలై 22: కామనె్వల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ ఇక్కడ జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో సెమీస్ చేరారు. తన సహచరుడు సమీర్ వర్మతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో కశ్యప్ 21-13, 21-16 తేడాతో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ కేవలం 40 నిమిషాల్లో ముగిసింది. అతను ఫైనల్‌లో స్థానం కోసం దక్షిణ కొరియాకు చెందిన వాంగ్ హీ హియోను ఢీ కొంటాడు. మరో క్వార్టర్ ఫైనల్‌లో ప్రణయ్ 10-21, 21-15, 21-18 స్కోరుతో జపాన్ క్రీడాకారుడు కాన్టా సునెయమాపై గెలిచాడు. అతను సెమీ ఫైనల్‌లో వియత్నాంకు చెందిన 15వ సీడ్ తియెన్ మిన్ గుయెన్‌తో తలపడతాడు. కాగా, పురుషుల డబుల్స్ విభాగంలో మనూ అత్రి, సుమీత్ రెడ్డి జోడీ సెమీ ఫైనల్‌కు చేరారు. వీరు క్వార్టర్ ఫైనల్‌లో హిరోకీ ఒకుమురా, మసయుకీ ఒనొడెరా జోడీని 21-18, 22-20 తేడాతో ఓడించి, సెమీస్‌లో టాప్ సీడ్స్ లూ చింగ్ యవో, యాంగ్ పొ హాన్ జోడీతో పోరును ఖాయం చేసుకున్నారు.