క్రీడాభూమి

ట్వీట్ చేసి సూప్‌లో పడ్డాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చైర్మన్, బిసిసిఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా చేసిన ఒక ట్వీట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లండన్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరిన భారత్‌ను అందరూ ప్రశంసల్లో ముంచెత్తారు. తాను కూడా అభినందనలు తెలపాలన్న అత్యుత్సాహంతో శుక్లా గొప్పగా ట్వీట్ చేశాడు. అయితే, ప్రపంచ చాంపియన్‌షిప్ అని కాకుండా చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశాడు. ఈ పొరపాటు అతని కొంప ముంచింది. మహిళల విభాగంలో చాంపియన్స్ ట్రోఫీ లేదన్న విషయం కూడా తెలియదా అని కొంత మంది నిలదీస్తే, ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ జరుగుతున్న అవగాహన కూడా లేకుండా బిసిసిఐలో కీలక పదవుల్లో కొనసాగడం ఏమిటని మరికొంత మంది మండిపడుతున్నారు. ప్రపంచ కప్ వంటి మేజర్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన మహిళా జట్టుటకు ఇచ్చే గౌరవం ఇదేనా అని చాలా మంది శుక్లాను విమర్శిస్తున్నారు. మొత్తం మీద అత్యుత్సాహంతో చేసిన ట్వీట్‌తో శుక్లా సూప్‌లో పడ్డాడు.

చిత్రం.. రాజీవ్ శుక్లా