రాష్ట్రీయం
తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 30 July 2017
నంద్యాల, జూలై 29: కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఆగస్టు నెలలో జరుగనున్న ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం శనివారం ప్రారంభమైంది. తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శనివారం బాధ్యతలు చేపట్టారు.
తొలి రోజు నవతరం పార్టీ తరఫున రావూస్ సుబ్రహ్మణ్యం, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్మహబూబ్బాషా నామినేషన్లు దాఖలు చేశారు. వీరు తమ నామినేషన్లను నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి ఆగస్టు 4వ తేదీ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.