క్రీడాభూమి

మహిళల వరల్డ్ కప్ క్రికెట్‌కు విశేష స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఆగస్టు 10: ఇంగ్లాండ్‌లో ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌కు విశేష స్పందన లభించిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించింది. పాకిస్తాన్ టైటిల్ సాధించగా, మిథాలీ రాజ్ నాయకత్వం వహించిన భారత జట్టు ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 18 కోట్ల మంది ఈ మ్యాచ్‌లను వీక్షించారని ఐసిసి తన ప్రకటనలో తెలిపింది. వీరిలో 15.6 కోట్ల మంది భారతీయులే కావడం విశేషం. గతంలో ఎన్నడూ మహిళల ప్రపంచ కప్ పోటీలకు ఇంతటి ఆదరణ లభించలేదని ఐసిసి స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రపంచ కప్‌తో పోలిస్తే ఈసారి వీక్షకుల సంఖ్య 300 శాతం పెరిగిందని వివరించింది. భారత్ తర్వాత ఈ మ్యాచ్‌లను యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎక్కువ మంది చూసినట్టు తెలిపింది.