క్రీడాభూమి

బొపన్న, రాజా జోడీ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడ్మాంటన్, సెప్టెంబర్ 17: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో కెనడాను ఎదుర్కొంటున్న భారత్ 1-2 తేడాతో వెనుకబడింది. మొదటి రోజున సింగిల్స్‌లో రాంకుమార్ రామనాథన్ విజయం సాధించగా, యుకీ భంబ్రీ చివరి వరకూ పోరాడినప్పటికీ పరాజయాన్ని చవిచూశాడు. దీనితో భారత్, కెనడా చెరొక విజయంతో సమవుజ్జీలుగా నిలిచాయి. రెండో రోజైన ఆదివారం జరిగిన డబుల్స్ పోరులో రోహన్ బొపన్న, పూరవ్ రాజా జోడీ ఓటమిపాలుకావడంతో, భారత్ వెనుకబడింది. డానియల్ నెస్టర్, వసెక్ పొస్పిసిల్ జోడీ 7-5, 7-5, 5-7, 6-3 ఆధిక్యంతో బొపన్న, రాజా జడోని ఓడించి కెనడాను ఆధిక్యంలో నిలిపింది. కాగా, రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ పోటీల్లో బ్రెడన్ షనర్‌తో యుకీ భంబ్రీ, 18 ఏళ్ల యువ సంచలనం డెనిస్ షపొవలోవ్‌తో రాంకుమార్ ఢీ కొంటారు. ఈ రెండు మ్యాచ్‌లను గెలిస్తేనే భారత్ ముందంజ వేస్తుంది.