క్రీడాభూమి

కోల్‌కతా చేరిన టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 18: ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో వనే్డ ఇంటర్నేషనల్‌ను ఆడేందుకు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి ఇక్కడికి చేరుకుంది. తెల్ల టి-షర్టులు ధరించిన ఆటగాళ్లు విమానాశ్రయం నుంచి నేరుగా తమ హోటల్‌కు వెళ్లిపోయారు. వారి వెంట కోచ్ రవి శాస్ర్తీ, ఇతర సపోర్టింగ్ స్ట్ఫా కూడా ఉన్నారు. ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకుంటారని, కాబట్టి సోమవారం ప్రాక్టీస్ సెషన్ లేదని భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను మొదటి వనే్డలో భారత్ 26 పరుగుల తేడాతో ఓడించి, అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నది.

చిత్రం..కోల్‌కతా విమానాశ్రయంలో లోకేష్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, అజింక్య రహానే తదితరులు