క్రీడాభూమి

ఫిఫా అండర్-17 ప్రపంచ కప్‌లో భారత్‌కు అమర్‌జీత్ సారథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, సెప్టెంబర్ 19: న్యూఢిల్లీలో వచ్చే నెల 6వ తేదీన ప్రారంభమై దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగనున్న ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు మిడ్ ఫీల్డర్ అమర్‌జీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. భారత జట్టు కెప్టెన్‌గా అతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. కెప్టెన్సీ కోసం పోటీపడుతున్న నలుగురిలో ఎవరిని ఎంపిక చేయాలో కాగితంపై రాసి ఇవ్వాలని భారత జట్టులోని 27 మంది సభ్యులకు కోచ్ లూరుూస్ నార్టన్ సూచించడంతో వారంతా ఏకగ్రీవంగా అమర్‌జీత్ సింగ్‌కు ఓటు వేశారు. ఈ ఎన్నికలో ద్వితీయ స్థానంలో నిలిచిన జితేంద్ర సింగ్ వైస్-కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత జట్టు కెప్టెన్సీ కోసం పోటీపడిన మిగిలిన ఇద్దరిలో సురేష్ సింగ్ మూడవ స్థానాన్ని దక్కించుకోగా, డిఫెండర్ సంజీవ్ స్టాలిన్ నాలుగో స్థానంలో నిలిచాడని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) అధికారి ఒకరు వెల్లడించారు.