క్రీడాభూమి
ప్రణవ్, సిక్కీ ఓటమి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 24 September 2017
టోక్యో, సెప్టెంబర్ 23: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరు ముగిసింది. ఇప్పటికే మహిళలు, పురుషుల సింగిల్స్లో పరాజయాలను ఎదుర్కొన్న భారత్ మిక్స్డ్ డబుల్స్లోనూ ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి జోడీ సెమీ ఫైనల్లో తీవ్రంగా పోరాడినప్పటికీ, టకురో హొకీ, సయాకా హిరొటా జోడీ చేతిలో 21-14, 15-21, 19-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మొదటి సెట్ను గెల్చుకున్న ప్రణవ్, సిక్కీ ఆతర్వాత రెండు సెట్లలో విజయం కోసం శక్తి వంచన లేకుండా పోరాటం సాగించారు. అయితే, వాటిని దక్కించుకోలేక, ఓటమిపాలయ్యారు.