క్రీడాభూమి

టోర్నీని భారత్ గెల్చుకుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను నిర్వహించే హక్కులను పొందడం ద్వారా ఈ టోర్నీని భారత్ ఇప్పటికే గెల్చుకుందని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) సహాయ కార్యదర్శి, క్రొయేషియా సాకర్ లెజెండ్ వొనిమిర్ బొబన్ వ్యాఖ్యానించాడు. గురువారం అతను ఇక్కడ విలేఖరులతో మాట్మాడుతూ, మైదానంలోకి దిగిన తర్వాత ఫలితాలు మాట ఎలావున్నా, భారత్ ఒక మెగా ఈవెంట్‌ను నిర్వహించే అవకాశాన్ని దక్కించుకోవడాన్ని మించిన విజయం లేదని అన్నాడు. భారత దేశంలో సాకర్ అభివృద్ధికి ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుందని అన్నాడు.