క్రీడాభూమి

టైటాన్స్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, అక్టోబర్ 7: ప్రో కబడ్డీ లీగ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ చివరి వరకూ పోరాడినప్పటికీ హర్యానా స్టీలర్స్ చేతిలో రెండు పాయింట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. వజీర్ సింగ్ 14 పాయింట్లతో రాణించగా, దీపక్ కుమార్ దహియా 5, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లు చేయడంతో హర్యానా 32 పాయింట్లు తన ఖాతాలో వేసుకోగలిగింది. టైటాన్స్ స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి 11, నీలేష్ సాలుంకే 10 పాయింట్లు నమోదు చేయడంతో టైటాన్స్‌కు 30 పాయింట్లు లభించాయి. మిగతా ఆటగాళ్లు కూడా తమవంతు ప్రయత్నం చేసి ఉంటే, ఫలితం మరోలా ఉండేది. కానీ, రాహుల్, నీలేష్‌ను మినహాయిస్తే అంతా మూకుమ్మడిగా విఫలం కావడం టైటాన్స్ ఓటమికి కారణమైంది.
మరో మ్యాచ్‌లో యుముంబాను జె పూర్ పింక్ పాంథర్స్ 36-32 తేడాతో ఓ డించింది. జైపూర్ తరఫున జస్వీర్ సింగ్ (9 పాయింట్లు), పవన్ కుమార్, మన్జీత్ సింగ్ (చెరి 6 పాయింట్లు) రాణించగా, యుముంబా ఆటగాళ్లలో కషిలింగ్ (7 పా యింట్లు), అనూప్ కుమార్ (6 పా యిం ట్లు) మెరుగైన ఆటను ప్రదర్శించారు.