క్రీడాభూమి
సుకేశ్ విజృంభణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 14 October 2017
పునే, అక్టోబర్ 13: ప్రో కబడ్డీలో శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్లో పునేరీ పల్టన్పై గుజరాత్ ఫార్ట్యూన్జెయింట్స్ 24 పాయింట్ల తేడాతో గెలిచింది. అద్వితీయ ప్రతిభతో విజృంభించిన సుకేశ్ హేగ్డె 15 పాయింట్లు సాధించడంతో, గుజరాత్ 44 పాయింట్లను అందుకోగలిగింది. సునీల్ కుమార్ ఏడు పాయింట్లు చేశాడు. పునేరీ పల్టన్ ఆటగాళ్లలో సురేష్ కుమార్ అత్యధికంగా ఆరు పాయింట్లు చేశాడు. రాజేష్ మోండల్, మోనూ చెరి మూడు పాయింట్లు సాధించారు. హోరాహోరీగా సాగిన రెండో మ్యాచ్లో తమిళ తలైవాస్ను బెంగాల్ వారియర్స్ ఓడించింది. బెంగాల్ 34 (మనీందర్ సింగ్ 12, సుర్జీత్ సింగ్ 6) పాయింట్లు చేయగా, తమిళ తలైవాస్ 30 (అజయ్ ఠాకూర్ 14, ప్రపంజన్ 10) పాయింట్లు సాధించింది.