క్రీడాభూమి

చెమటోడ్చకుండానే సుశీల్‌కు స్వర్ణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, నవంబర్ 17: రెండు పర్యాయాలు ఒలింపిక్స్ పతకాలను కైవసం చేసుకున్న సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఇక్కడ జరుగుతున్న జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ పురుషుల 74 కిలోల విభాగంలో చెమటోడ్చకుం డానే స్వర్ణ పతకం లభించింది. మొత్తం మీద అతను కేవలం రెండు నిమిషా ల 33 సెకన్లు మాత్రమే మ్యాట్‌పై కనిపించాడు. క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ లో అతని ప్రత్యర్థులు వివిధ కారణాలతో వాకోవర్ ఇవ్వగా సుశీల్ ఫైనల్ చే రాడు. టైటిల్ కోసం పోరాడాల్సిన పర్‌వీన్ రాణా కూడా గాయం కారణంగా ఫైనల్‌లో పోటీకి దిగలేదు. దీనితో సుశీల్ ఎలాంటి కష్టం లేకుండా స్వర్ణ పత కాన్ని దక్కించుకున్నాడు. కాగా, మహిళల 62 కిలోల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ 10-0 తేడాతో పూజాను చిత్తు చేసి స్వర్ణం సాధించింది. 59 కిలోల విభాగంలో గీతా ఫొగట్ తన ప్రత్యర్థి రవితపై గెలిచింది. ఆమె భర్త పవన్ కుమార్ పురుషుల 80 కిలోల విభాగం లో స్వర్ణ పతకం సాధించడం విశేషం.

చిత్రం.. సుశీల్ కుమార్‌