క్రీడాభూమి

చైనా ఓపెన్‌లో సింధు ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫజూ, నవంబర్ 17: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్ నుంచే ఆమె వెనుదిరిగింది. చైనాకు చెందిన 19 ఏళ్ల గవో ఫాంగ్జీ చేతిలో ఆమె 11-21, 10-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ టోర్నీలోకి అడుగుపెట్టే వరకూ ఎవరికీ పరిచయం లేని పాంగ్జీ ఇప్పుడు సింధుపై నెగ్గడంతో ఒక్కసారిగా స్టార్ హోదాను సంపాదించింది. మహిళల సింగిల్స్‌లోనే సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ ఇది వరకే పరాజయాలను చవిచూడడంతో, చైనా ఓపెన్‌లో భారత్ పతకాల ఆశలకు తెరపడింది.