క్రీడాభూమి

బెంగళూరు ఓపెన్‌లో యూకీ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 21: బెంగళూరు ఓపెన్ ఎటిపి టోర్నమెంట్‌లో భారత టాప్ సింగిల్స్ ఆటగాడు యూకీ బాంబ్రీ బోణీ చేశాడు. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన అతను మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో 6-3, 6-2 సెట్ల తేడాతో తన సహచరుడు శ్రీరామ్ ఎన్.బాలాజీపై విజయం సాధించాడు. అయతే ఈ టోర్నీలో భారత్‌కు చెందిన విష్ణువర్ధన్, సూరజ్ ప్రబోధ్‌లకు ఆదిలోనే చుక్కెదురైంది. వైల్డ్ కార్డుతో బరిలోకి దిగిన విష్ణు వర్ధన్ తొలి రౌండ్‌లో 3-6, 3-6 తేడాతో మారియో విలెల్లా మార్టినెజ్ (స్పెయన్) చేతిలో ఓటమిపాలవగా, మరో మ్యాచ్‌లో స్వీడన్ ఆటగాడు ఇలియాస్ యెమెర్ 6-4, 7-6 తేడాతో సూజర్‌ను ఓడించాడు.