క్రీడాభూమి

అండర్-19 కెప్టెన్‌గా పృథ్వీ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు సంచలన ఆటగాడు పృథ్వీ షా నాయకత్వం వహించనున్నాడు. 16 మంది సభ్యులతో కూడిన జట్టును జాతీయ జూనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టోర్నమెంట్ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకూ మూడు పర్యాయాలు ఈ టోర్నమెంట్‌ను కైవసం చేసుకున్న భారత్ నాలుగోసారి విజేతగా నిలిచేందుకు శ్రమించనుంది. ఆస్ట్రేలియా కూడా భారత్‌తో సమానంగా మూడుసార్లు అండర్-19 వరల్డ్ కప్‌ను గెల్చుకుంది.