క్రీడాభూమి

లంక టి-20 జట్టులో మలింగకు దక్కని చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, డిసెంబర్ 15: భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో సీనియర్ పేసర్ లసిత్ మలింగకు చోటు దక్కలేదు. అతనికి విశ్రాంతినిచ్చినట్టు ప్రకటించిన సెలక్టర్లు కారణాలను మాత్రం వివరించలేదు. అయితే, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఆడినందుకే అతనిని జాతీయ జట్టు నుంచి పక్కకు పెట్టారన్న వాదన వినిపిస్తున్నది. సురంగ లక్మల్, లాహిరు తిరిమానేకు టి-20 జట్టులో స్థానం లభించలేదు. విశ్వ ఫెర్నాండో, దసున్ షణక జట్టులోకి వచ్చారు. ఈనెల 22న కటక్, 22న ఇండోర్, 24న ముంబయిలో భారత్‌తో శ్రీలంక టి-20 మ్యాచ్‌లు ఆడుతుంది.
శ్రీలంక టి-20 జట్టు ఇదే..
తిసర పెరెరా (కెప్టెన్), ఉపుల్ తరంగ, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ జనిత్ పెరెరా, దనుష్క గుణతిలక, నిరోషన్ డిక్‌విల్లా, అసెల గుణరత్నే, సదీర సమరవిక్రమ, దసున్ షణక, చతురంగ డి సిల్వ, సచిత్ పథిరన, ధనంజయ డి సిల్వ, నువాన్ ప్రదీప్, నువాన్ ప్రదీప్, దష్మంత చమీర.

చిత్రం..లసిత్ మలింగ