క్రీడాభూమి

ధోనీకి కోపమొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 24: ప్రతికూల సమయాల్లోనూ ఒత్తిడికి గురికాకుండా సంయమనం పాటించే ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీకి కోపమొచ్చింది. భారత కెప్టెన్ ఓ విలేఖరిపై ఆగ్రహం వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్ చివరి వరకూ ఓటమి ప్రమాదం అంచున నిలబడి, అతి కష్టం మీద ఒక పరుగు తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత విలేఖరుల సమావేశానికి హాజరైన ధోనీ నవ్వుతూ కనిపించాడు. అయితే, ‘బంగ్లాదేశ్ లాంటి జట్టుపై కేవలం ఒక పరుగు తేడాతో గెలుపొందడాన్ని మీరు విజయంగానే భావిస్తున్నారా?’ అని మొదట్లోనే ఓ విలేఖరి ప్రశ్నించడంతో ధోనీ అసహనానికి గురయ్యాడు. అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. ‘మీకు భారత్ గెలవడం ఇష్టం లేనట్టుగా ఉంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సదరు విలేఖరి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా, అతనిని మధ్యలోనే అడ్డుకుంటూ ‘మీరు ప్రశ్న అడిగిన తీరు, వేసిన ప్రశ్నను చూస్తుంటే ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం ఇష్టం లేనట్టుగా అనిపిస్తున్నది. క్రికెట్ మ్యాచ్‌ల గురించి మాట్లాడడానికి స్క్రిప్ట్ అవసరం లేదు’ అంటూ తీవ్ర స్వరంతో అన్నాడు. టాస్ ఓడిన తర్వాత ఒక జట్టు పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ముందుగా విశే్లషించుకోవాలని హితవు పలికాడు. మైదానం బయట కూర్చొని, ఏదీ విశే్లషించుకోకుండా ప్రశ్నించడం సమంజసం కాదన్నాడు.