క్రీడాభూమి

దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్ టైటిల్ పోరులో సింధు ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 17: దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్ టైటిల్ పోరులో భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రన్నరప్ ట్రోఫీకి పరిమితమైంది. టైటిల్ పోరులో అకానే యమాగూచీతో తలపడిన ఆమె మొదటి సెట్‌ను 21-15 తేడాతో గెల్చుకొని, గెలుపుపై అభిమానుల్లో ఆశలు రేపింది. కానీ, ఒక సెట్‌ను కోల్పోయినప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గని యమాగూచీ ఎదురుదాడికి దిగడంతో సింధు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరి రెంటు సెట్లను ఆమె 12-21, 19-21 తేడాతో చేజార్చుకుంది. సుమారు గంటన్నరపాటు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాది సింధు ఇండియన్ ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిళ్లను సాధించింది. హాంకాంగ్ ఓపెన్‌తోపాటు వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్ వరకూ చేరి, చివరి ప్రయత్నంలో విఫలమైంది. మరోసారి ఫైనల్ అడ్డంకిని ఆమె అధిగమించలేకపోయింది.