క్రీడాభూమి

డోటిన్ ఆల్‌రౌండ్ ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మార్చి 27: దియేంద్ర డోటిన్ ఆల్‌రౌండ్ ప్రతిభ మహిళల టి-20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై వెస్టిండీస్‌కు విజయాన్ని సాధించిపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ 45 బంతుల్లో 47, డోటిన్ 40 బంతుల్లో 45 చొప్పున పరుగులు చేసి, విండీస్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ 23 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చింది. అనుజా పాటిల్ 16 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 111 పరుగులు చేసి, మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో మిథాలీ రాజ్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్మృతి మందానా 22, వేదా కృష్ణమూర్తి 18, అనుజా పాటిల్ 26, ఝూలన్ గోస్వామి 25 చొప్పున పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో పది పరుగులు చేయాల్సిన భారత్ ఆరు పరుగులను సాధించి, మూడు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా కీలక మ్యాచ్‌లో ఓటమిపాలైంది.