క్రీడాభూమి
మళ్లీ కోహ్లీనే..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మొహాలీ, మార్చి 27: టి-20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి, భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. ఆస్ట్రేలియా ఆరు వికెట్లకు 160 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా టీమిండియా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. ఫైనల్లో స్థానం కోసం వెస్టిండీస్తో భారత్ తలపడుతుంది. మరో సెమీ ఫైనల్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతుంది.
ఓపెనర్ల శుభారంభం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా, ఆరోన్ ఫించ్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. అయితే, తొలి వికెట్కు 54 పరుగులు జోడించిన తర్వాత ఆశిష్ నెహ్రా బౌలింగ్లో ధోనీ చక్కటి క్యాచ్ అందుకోగా ఖాజా పెవిలియన్ చేరడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఖాజా 16 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లతో 26 పరుగులు సాధించాడు. తర్వాత కొద్ది సేపటికే ఫస్ట్డౌన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా వెనుదిరిగాడు. అతను కేవలం ఆరు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి, ధోనీ స్టంప్ చేయడంతో వెనుదిరిగాడు. రెండు పరుగులు చేసిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్ను ధోనీ క్యాచ్ పట్టగా యువరాజ్ సింగ్ వెనక్కు పంపాడు. 74 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం ఆరోన్ ఫించ్, గ్లేన్ మాక్స్వెల్ కలిసి స్కోరును వంద పరుగుల మైలురాయికి చేర్చారు. అదే సమయంలో హార్దిక్ పాండ్య వేసిన బంతిని అర్థం చేసుకోవడంలో విఫలమైన ఫించ్ పొరపాటుగా షాట్ కొట్టి మిడ్ వికెట్ స్థానంలో కాపుకాసిన శిఖర్ ధావన్కు దొరికాడు. అతను 34 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగులు సాధించాడు. ఐదో వికెట్కు గ్లేన్ మాక్స్వెల్, షేన్ వాట్సన్ కలిసి 30 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వేగంగా పరుగులు తీస్తూ, బలపడుతున్నట్టు కనిపిస్తున్న మాక్స్వెల్ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. మాక్స్వెల్ 28 బంతుల్లో 31 పరుగులు చేశాడు. పది బంతుల్లో పది పరుగులు చేసిన జేమ్స్ ఫాల్క్నెర్ లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్కు ప్రయత్నించి, హార్దిక్ పాండ్య బౌలింగ్లో విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. చివరిదైన అదే ఓవర్లో వాట్సన్ (18 నాటౌట్) ఒక ఫోర్, పీటర్ నెవిల్ (రెండు బంతుల్లో 10) ఒక ఫోర్, మరో సిక్సర్ బాదారు. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించగలిగింది.
ఆదుకున్న కోహ్లీ
సెమీస్లో అడుగుపెట్టడానికి 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ను రోహిత్ శర్మతో కలిసి ఆరంభించిన శిఖర్ ధావన్ వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేశాడు. అయితే, 12 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, ఒక సిక్సర్తో 13 పరుగులు చేసిన అతను నాథన్ కౌల్టన్ నైల్ బౌలింగ్లో ఉస్మాన్ ఖాజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో తొలి వికెట్ కూలింది. కొద్ది సేపటికే మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా వెనుదిరిగాడు. 12 పరుగులు చేసిన అతనిని షేన్ వాట్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. టి-20 స్పెషలిస్టు సురేష్ రైనా ఎక్కువ సేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. పది పరుగులు చేసిన అతను షేన్ వాట్సన్ బౌలింగ్లో వికెట్కీపర్ పీటర్ నెవిల్కు చిక్కాడు. 49 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ చేజార్చుకుంది. కోహ్లీతో కలిసి నాలుగో వికెట్కు 6.2 ఓవర్లలో 45 పరుగులు జోడించిన యువరాజ్ సింగ్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జేమ్స్ ఫాల్క్నెర్ బౌలింగ్లో వాట్సన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రన్రేట్ పెరుగుతున్నప్పటికీ, వ్యూహాత్మకంగా ఆడిన కోహ్లీ భారత్ను ఆదుకున్నాడు. అతను 39వ బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. తర్వాత ఫాల్క్నెర్ వేసిన ఓవర్లో కోహ్లీ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా, భారత్కు మొత్తం 19 పరుగులు లభించాయి.దీనితో చివరి రెండు ఓవర్లలో విజయానికి టీమిండియా 20 పరుగుల దూరంలో నిలిచింది. నాథన్ కౌల్టర్ నైల్ వేసిన 19 ఓవర్లో కోహ్లీ నాలుగు ఫోర్లు కొట్టాడు. చివరి ఓవర్లో విజయం సాధించేందుకు భారత్కు కేవలం నాలుగు పరుగులు అవసరమయ్యాయి. ఫాల్క్నెర్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతిని ధోనీ బౌండరీగా మలచి, మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే భారత్కు కీలక విజయాన్ని అందించాడు. 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు టీమిండియా 161 పరుగులు చేసింది. అప్పటికి కోహ్లీ 82 (51 బంతులు, 9 ఫోర్లు, రెండు సిక్సర్లు), ధోనీ 18 (10 బంతులు, 3 ఫోర్లు) పరుగులతో నాటౌట్గా నిలిచారు.