క్రీడాభూమి

సింధు, శ్రీకాంత్‌పైనే భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు, ప్రపంచ మూడో నంబర్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ మలేషియాలో ఫిబ్రవరి 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్న ఆసియా బాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌ను గెలిపించే భారాన్ని తన భుజాలపై వేసుకొని బరిలోకి దిగుతున్నారు. 2016లో హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల విభాగంలో భారత్ సెమీఫైనల్స్ చేరింది. కానీ, ఇండొనేషియా జట్టు చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, ఫైనల్‌కు అర్హత సంపాదించలేకపోయంది. అదేవిధంగా దక్షిణ కొరియాతో జరిగిన మహిళల టోర్నీలో భారత్ జట్టు క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లగలిగింది.