క్రీడాభూమి

కివీస్‌పై భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టౌరంగ (న్యూజిలాండ్), జనవరి 20: నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం టౌరంగ బ్లేక్ పార్క్‌లో జరిగిన తుది గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ 3-1 తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్ అన్నివిధాల సంసిద్ధమై కివీస్‌ను ఎదుర్కొని విజయం సాధించి, ఫైనల్ చేరింది. టైటిల్ కోసం బెల్జియంతో ఆదివారం జరిగే తుది పోరాటానికి సన్నాహాలు చేస్తోంది. కాగా, మరో చివరి గ్రూప్ మ్యాచ్‌లో జపాన్‌ను 4-1 తేడాతో చిత్తుచేసి బెల్జియం ఫైనల్‌కు దూసుకొచ్చింది. అన్ని విభాగాల్లోనూ రెండు జట్లు సమవుజ్జీలుగా ఉండడంతో ఫైనల్ ఉత్కంఠను రేపడం ఖాయడంగా కనిపిస్తోంది. ఇంతకుముందు జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 0-2 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న భారత్ ఆదివారం తుదిపోరులో ప్రతీకారం తీర్చుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.