క్రీడాభూమి
ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో బొపన్న-బబోస్ జోడీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెల్బోర్న్, జనవరి 23: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో భారత్ ఆటగాడు బొపన్న, హంగేరీ ఆటగాడు థిమియా బబోస్తో కలసి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన టోర్నీలో ఐదో సీడ్ జంట అయిన బొపన్న, థిమియా జోడీ అమెరికాకు చెందిన జోడి వానియా కింగ్, క్రొయేషియాకు చెందిన ఫ్రాంకో కుగోర్పై 6-4, 6-4 తేడాతో విజయం సాధించారు. ఈ ఇండో-హంగేరి జోడి అంతకుముందు జరిగిన రౌండ్లో ఆస్ట్రేలియా అన్సీడెడ్ జోడీ విట్టింగ్టన్, పెరెజ్ను 6-2, 6-4 తేడాతో ఓడించారు. ఈ విజయంతో బొపన్న, థిమియా జోడీ బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో అన్సీడెడ్ కొలంబియా ఆటగాడు జువాన్ సెబాస్టియన్, అమెరికా ఆటగాడు అభిగెయిల్ స్పియర్ జోడీతో తలపడతారు. ఇదిలావుండగా సోమవారం జరిగిన పురుషుల డబుల్స్లో భారత్ ఆటగాళ్లు లియాండర్ పేస్, పురవ్ రాజా, దివిజ్ శరణ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.