క్రీడాభూమి

డబ్ల్యుబిఓలో నా ఫైట్ వీక్షించండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: మన దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీలు నిర్వహించేందుకు గల అవకాశాలపై స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో శుక్రవారం చర్చలు జరిపాడు. అంతేకాకుండా న్యూఢిల్లీలో జూన్ 11వ తేదీన జరిగే డబ్ల్యుబిఓ ఆసియా టైటిల్ ఫైట్‌లో తన పోరాటాన్ని వీక్షించేందుకు రావలసిందిగా కేజ్రీవాల్‌ను విజేందర్ సాదరంగా ఆహ్వానించాడు. ఐఓఎస్ బాక్సింగ్ ప్రమోషన్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న తన ప్రమోటర్ నీరవ్ తొమర్‌తో కలసి ఢిల్లీ సచివాలయానికి వెళ్లిన విజేందర్ సింగ్ అక్కడ కేజ్రీవాల్‌తో చర్చించాడు. ఈ సమావేశం ముగిసిన అనంతరం విజేందర్ మాట్లాడుతూ, వ్యక్తిగతంగా కేజ్రీవాల్‌ను కలుసుకోవడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, డబ్ల్యుబిఓ ఆసియా టైటిల్ ఫైట్‌లో తన పోరాటాన్ని తిలకించేందుకు రావలసిందిగా కేజ్రీవాల్‌ను సాదరంగా ఆహ్వానించానని తెలిపారు. దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీలు నిర్వహించేందుకు గల అవకాశాల గురించి కేజ్రీవాల్‌తో చర్చించగా, ఈ విషయంలో తనకు సాయాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారని విజేందర్ తెలిపాడు. ‘ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీల్లో నా బౌట్లను కేజ్రీవాల్ ఫాలో అవుతున్నారని తెలిసి ఎంతో సంతోషం కలిగింది. దేశ రాజధానిలో జూన్ 11వ తేదీన జరిగే డబ్ల్యుబిఓ ఆసియా టైటిల్ ఫైట్‌లో నా బౌట్‌ను తిలకించేందుకు కేజ్రీవాల్ వస్తారని ఎదురు చూస్తున్నా’ అని విజేందర్ పేర్కొన్నాడు. గత ఏడాది ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారినప్పటి నుంచి వరుసగా నాలుగు బౌట్లలోనూ విజయాలు సాధించిన విజేందర్ సింగ్ లండన్‌లో ఏప్రిల్ 30వ తేదీన తదుపరి బౌట్‌లో తలపడానికి ముందు ప్రస్తుతం స్వదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. లండన్‌లోని కాపర్ బాక్స్ ఎరీనాలో జరిగే ఈ బౌట్ కోసం విజేందర్ తదుపరి శిక్షణ కోసం వచ్చే వారం మాంచెస్టర్‌కు బయలుదేరి వెళ్లనున్నాడు.