క్రీడాభూమి

నేడు బంగ్లా-భా రత్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 17: ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న నిదహాస్ టీ-20 ముక్కోణపు టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో విజయం సాధించి, ఒక దాన్లో ఒటమిని చవిచూసి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండింట్లో గెలిచి, మరో రెండింట్లో ఓడిపోయి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆతిధ్య జట్టు శ్రీలంక బంగ్లాదేశ్‌పై ఓటమి చెందడంతో ఫైనల్స్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. ఈ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒకదాన్లో మాత్రమే విజయం సాధించి, మూడింట్లో ఓటమిని చవిచూసి, రెండు పాయింట్లు సాధించింది. ఆదివారం జరిగే నిదహాస్ టీ-20 టోర్నీలో ఆఖరి పోరాటంలో టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు నువ్వా-నేనా అనే రీతిలో పోరాడనున్నాయి.
ఒకవిధంగా చెప్పాలంటే భారత్, బంగ్లాదేశ్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. తుదిపోరులో టీమిండియాలో మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం చోటు కల్పించారు. ఈ ఒక మార్పు మినహా జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఇక బంగ్లాదేశ్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా ఉన్న టీమ్‌తోనే రంగంలోకి దిగుతోంది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్స్‌లో బంగ్లాదేశ్ జట్టులోకి షకీబ్ ఆల్ హసన్ రావడం, కెప్టెన్సీ బాధ్యతలు చేజిక్కించుకోవడం తమకు కలిసొచ్చే అదృష్టమని ఆ జట్టు భావిస్తోంది. వేలి గాయం కారణంగా షకీబ్ టీ-20 మ్యాచ్‌లలో ఆడలేకపోయాడు. ఈ జట్టులో ముస్త్ఫికర్ రహీం, మహ్మదుల్లా వంటివారు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఇపుడు ఈ జట్టు కెప్టెన్ కూడా వీరికి తోడు కావడంతో గెలుపుపై బంగ్లా జట్టుకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఎల్.కే.రాహుల్, దినేష్ కార్తీక్ వంటి బ్యాట్స్‌మెన్‌లు ఆ జట్టు బాధ్యతలను తమ భుజస్కంధాలపై మోసుకువస్తున్నారు. వీరికి తోడు యుజ్వేంద్ర చాహల్, జయదేవ్ ఉనద్కత్ వంటివారు తమ బౌలింగ్‌లో ప్రత్యర్థులను హడలెత్తించగలరు. బంగ్లాదేశ్‌పై టీమిండియానే ఎక్కువగా ఫేవరెట్‌గా నిలిచింది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు భారత్‌తో తలపడిన నాలుగు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో నాలుగుసార్లు ఫైనల్స్ వరకు వెళ్లింది. ఆడిన టీ-20ల్లో మూడుసార్లు ఫైనల్ వరకు వెళ్లినా అన్నిమ్యాచ్‌లను కోల్పోయింది. ఢాకా బయట జరుగుతున్న ఫైనల్ పోరులో బంగ్లాదేశ్ ఆడడం ఇదే తొలిసారి.
భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సురేష్ రైనా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), లోకేష్ రాహుల్, మనీష్ పాండే, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, శ్రాద్ధూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, రిషబ్ పంత్.
బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ ఆల్ హసన్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిటోన్ దాస్, షబ్బీర్ రహ్మాన్, ముస్త్ఫికర్ రహీం (వికెట్ కీపర్), సౌమ్యా సర్కార్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, ముస్త్ఫాజుర్ రహ్మాన్, రోబెల్ హోస్సేన్, నజాముల్ ఇస్లామ్, అబూ జయదేవ్, తస్కిన్ అహ్మద్, నూరుల్ హసన్.

చిత్రాలు.. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ * బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ ఆల్ హసన్