క్రీడాభూమి
బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం: రహానే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ 11లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో ఓడిపోవడంపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అంజిక్యా రహానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ రాజస్థాన్, బ్యాట్స్మెన్ల మధ్య ఒక్క బలమైన భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పలేకపోవడంతోనే తాము ఓడిపోయామని తెలిపాడు. ఉప్పల్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలి సిందే. కాగా, ఓటమికి కారణాలను రహానే ఒక ఇంటర్వ్యూలో విశే్లషించాడు. ‘ఈ వికెట్ మీద 150 నుంచి 160 పరుగులు చేస్తే.. నిలబెట్టుకోవచ్చని అనుకున్నాం. మీడియం పేస్కు అనుకొలంగా బంతి పడుతుండటంతో ఆ స్కోరు సరిపోతుందని భావించాము. కానీ, మేము భారీ భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయాం. వరుసగా వికెట్లు పడ్డాయి. ఇన్నింగ్స్ను నిలబెట్టే కీలక పార్ట్నర్షిప్ కుదరలేదు’ అని రహానే తెలిపాడు. అయితే, ఐపీఎల్లో తమకు ఇది తొలి మ్యాచ్ మాత్రమేనని, రానున్న మ్యాచ్ల్లో ఉత్తమంగా ఆడతామని ధీమా వ్యక్తం చేశాడు.