క్రీడాభూమి

మహిళల డబుల్ ట్రాప్ షూటింగ్ విజేత శ్రేయాసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: కామనె్వల్త్ గేమ్స్ మహిళల షూటింగ్‌లో భారత్‌కు బుధవారం మరో స్వర్ణ పతకం లభించింది. డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో గట్టిపోటీని ఎదుర్కొన్న శ్రేయాసీ సింగ్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా షూటర్ ఎమ్మా కాక్స్ నుంచి ఆమెకు తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరూ చెరి 96 పాయింట్లు సంపాదించారు. అయితే, ప్రోగ్రెసివ్ స్కోర్‌లో ముందంజలో ఉన్న శ్రేయాసీకి స్వర్ణ పతకం లభించగా, కాక్స్ రజత పతకాన్ని అందుకుంది. స్కాట్‌లాండ్‌కు చెందిన లిండా పియర్సన్ 87 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అంతగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రేయాసీ తన నాలుగు ప్రయత్నాల్లోనూ చక్కటి ప్రతిభ కనబరచి, వరుసగా 24, 25, 24, 25 చొప్పున పాయింట్లు సంపాదించింది. కాక్స్‌కు 23, 28, 27, 18 చొప్పున పాయింట్లు లభించాయి. కాంస్య పతకాన్ని అందుకున్న లిండా వరుసగా 24, 25, 18, 20 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. భారత్‌కే చెందిన మరో షూటర్ వర్ష వర్మ తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. 21, 25, 21, 19 చొప్పున ఆమె మొత్తం 86 పాయింట్లకు చేరుకోగలిగింది. లిండా కంటే ఆమె కేవలం ఒక పాయింట్ వెనుకంజలో నిలవడంతో, కాంస్యాన్ని అందుకునే అవకాశాన్ని చేజార్చుకుంది.