క్రీడాభూమి

రేప్ ఘటనలు బాధిస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: మన దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో జరుగుతున్న రేప్ సంఘటనలు తమను ఎంతో బాధిస్తున్నాయని భారత బాక్సింగ్ దిగ్గజం, రాజ్యసభ సభ్యురాలు ఎం.సి.మేరీ కోమ్ వ్యాఖ్యానించింది. చిన్నారులపై జరుగుతున్న ఇలాంటి దారుణ సంఘటనలు తన హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయని, ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నామనే బాధ మరో పక్క వేధిస్తోందని ఆమె వాపోయింది. 2012 సంవత్సరంలో జరిగిన నిర్భయ సంఘటన తర్వాత కొద్దిరోజుల కిందట జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోని కతువా జిల్లాలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో ప్రాంతంలో చిన్నారి బాలికలపై జరిగిన రేప్ ఘటనలు దేశవ్యాప్తంగా అంతటి సంచలనం సృష్టించిన విషయాన్ని మేరీ కోమ్ ప్రస్తావించింది. ‘ఇలాంటి దారుణ సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఏమి చేస్తోందో...సరైన నిర్ణయం తీసుకోవాలి. నాకంటే వారికే బాగా తెలుసు. ఒక మహిళగా ఈ ఘటనలు నాలో ఎంతో మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇదిలావుండగా భారత బాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బాలికలు, మహిళలపై ఇటీవల కాలంలో మన దేశంలో జరుగుతున్న అమానవీయ సంఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయని, సమాజంలో రోజురోజుకూ ఇలాంటి సంఘటనల ద్వారా విలువలు పతనం అవుతున్నాయని, ఇలాంటి దారుణ సంఘటనలను ప్రతిఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది.