క్రీడాభూమి

చాంపియన్ ట్రోఫీ హాకీ పాక్‌పై భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెడా (నెదర్లాండ్స్), జూన్ 23: భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో శనివారం జరిగిన చాంపియన్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్‌లో 4-0తో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఆటగాళ్లు ఈ మ్యాచ్ ద్వారా ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకున్నారు. రమణ్‌పీదీప్ సింగ్ 26వ, 60 నిమిషంలోను, దిల్‌ప్రీత్ సింగ్ 54వ నిమిషంలో, మన్‌దీప్ సింగ్ 57వ నిమిషంలో మొత్తం నాలుగు గోల్స్ చేసి జట్టును విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆట ప్రారంభం నుంచి ప్రత్యర్థి జట్టు భారత్ స్ట్రైకర్లకు తీవ్ర ప్రతిఘటన ఇచ్చినా, దాడులు చేసినా వెరవకుండా పోరాడారు. కాగా, భారత్ జట్టు ఆదివారం తమ తదుపరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్స్ అర్జెంటీనాతో తలపడతారు.