క్రీడాభూమి

పంజాబ్ రెండో హోం గ్రౌండ్‌గా ధర్మశాల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు రెండో హోం గ్రౌండ్‌గా ధర్మశాల ఉంటుంది. వచ్చేనెల అక్కడ మూడు మ్యాచ్‌లు జరగే అవకాశం ఉంది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి మే ఒకటో తేదీ తర్వాత మహారాష్టల్రో జరగాల్సిన మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. అక్కడ మూడు మ్యాచ్‌లు ఆడాల్సిన పంజాబ్ రెండో హోం గ్రౌండ్‌గా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలను ఎంపిక చేసుకుంది. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ ఇప్పటికే విశాఖపట్నం నగరాన్ని రెండో హోం గ్రాండ్‌గా ప్రకటించింది. ముంబయి ఇండియన్స్ మహారాష్ట్ర నుంచి తరలిపోయే మ్యాచ్‌లను జైపూర్‌లో ఆడనున్నట్టు ప్రకటిచింది. ఫైనల్‌కు బెంగళూరు ఆతిథ్యమిస్తుంది.