క్రీడాభూమి
వినేష్పై అనర్హత వేటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 24 April 2016
ఉలాన్బాతర్ (మంగోలియా), ఏప్రిల్ 23: భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్పై అనర్హత వేటు పడింది. ఇక్కడ ఆరంభమైన ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో 48 కిలోల విభాగంలో వినేష్ పోటీ పడాల్సి ఉండింది. అయితే, బౌట్కు ముందు చేసిన పరీక్షలో ఆమె బరువు 400 గ్రాములు అధికంగా ఉన్నట్టు తేలింది. దీనితో నిర్వాహకులు ఆమెపై అనర్హత వేటు వేశారు. అంతేగాక, బరువును సరిచూసుకోకుండా, తప్పుడు సమచారం ఇచ్చినందుకు ఆమెను తీవ్రంగా మందలించారు. ఇలావుంటే, క్వాలిఫయర్స్లో భారత్ మహిళలు బబిత 53, గీత ఫోగత్ 58, అనిత 63, నవ్జోత్ కౌర్ 69, జ్యోతి 75 కిలోల విభాగాల్లో పోటీకి దిగారు. బబిత, గీత, జ్యోతి తమతమ తొలి బౌంట్స్లో పరాజయాలను ఎదుర్కొన్నారు. అనిత, నవ్జోత్ ఓటములతో పోటీల నుంచి నిష్క్రమించారు.