క్రీడాభూమి

రైనా వర్సెస్ కోహ్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, ఏప్రిల్ 23: భారత క్రికెట్ జట్టులో కీలకంగా ఉన్న ఇద్దరు క్రికెటర్లు సురేష్ రైనా, విరాట్ కోహ్లీ మధ్య ఆధిపత్యం పోరాటం ఆదివారం అభిమానులకు కనువిందు చేయనుంది. టీమిండియా టెస్టు జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మెట్స్ నాయకత్వ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీని తప్పిస్తే, ఆ స్థానాన్ని అందుకోవడానికి కోహ్లీతోపాటు రైనా కూడా రేసులో ఉన్నాడు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం చాలాకాలంగా కొనసాగుతున్నది. అయితే, బలాబలాలు తేల్చుకునే అవకాశం ఆదివారం వారికి దక్కనుంది. రైనా కెప్టెన్సీలో గుజరాత్ లయన్స్, కోహ్లీ నాయకత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆదివారం జరిగే ఐపిఎల్ పోరు ఉత్కంఠ రేపుతోంది. మొట్టమొదిసారి ఐపిఎల్‌లోకి అడుగుపెట్టిన గుజరాత్ మొదటి మూడు మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసి సంచలనం సృష్టించింది. అయితే, సన్‌రైజర్స్‌తో పోటీపడి పరాజయాన్ని చవిచూసింది. తొలి ఓటమి షాక్ నుంచి కోలుకొని మళ్లీ ఫామ్‌లోకి రావడానికి గుజరాత్ కృషి చేయనుంది. ఇలావుంటే, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో విజయం సాధించిన బెంగళూరు అదే ఊపులో మరో విజయాన్ని నమోదు చేసేందుకు సమాయత్తమవుతున్నది. కాగితంపై చూస్తే రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి.
మ్యాచ్ శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలు.