క్రీడాభూమి

ఉమేష్ యాదవ్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: వెస్టిండీస్‌తో త్వరలో జరిగే ఐదు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించే టీమిండియా జట్టులోకి పేసర్ ఉమేష్ యాదవ్‌కు చోటు దక్కింది. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన రెండు టెస్టుల్లో 10 వికెట్లు పడగొట్టిన ఉమేష్ యాదవ్‌కు జట్టు యాజమాన్యం నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. తొలుత రెండు వనే్డలకు ఎంపికైన శార్దూల్ ఠాకూర్ గాయపడడంతో అతని స్థానంలో సెలక్టర్లు ఉమేష్ యాదవ్‌కు స్థానం కల్పించారు. శార్దూల్ ఠాకూర్ ఐదు వనే్డల్లోనూ ఆడే అవకాశం లేదు. టెస్టులో చోటుదక్కించుకున్న శార్దూల్ ఠాకూర్ హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో కేవలం 10 బంతులు విసిరి కండరాల నొప్పితో అవస్థ పడ్డాడు. దీంతో అతనికి పూర్తి విశ్రాంతినిచ్చిన సెలక్షన్ కమిటీ అతని స్థానంలో ఉమేష్‌యాదవ్‌కు చోటు కల్పించింది. హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టుల్లోని రెండు ఇన్నింగ్స్‌లో ఉమేష్ యాదవ్ 6/88, 4/45 సాధించాడు. ఇప్పటివరకు ఆడిన 73 వనే్డలలో 105 వికెట్లు పడగొట్టాడు.