క్రీడాభూమి

విశాఖ చేరుకున్న భారత్-వెస్టిండీస్ జట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: అయిదు వనే్డల సిరీస్‌లో భాగంగా 24న జరిగే రెండో వనే్డలో తలపడేందుకు భారత్, వెస్టీండీస్ క్రికెటర్లు సోమవారం విశాఖ చేరుకున్నారు. గౌహాతీలో జరిగిన తొలి వనే్డలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ నేతృత్వంలో ఇరు జట్లు సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నాయి. ఇరు జట్లకు మ్యాచ్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ జట్టు ఈ స్టేడియంలో వరస విజయాలను కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే సెంటిమెంట్ కొనసాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే అన్ని కేటగిరీలకు చెందిన టిక్కెట్‌లు హాట్ కేక్‌ల్లా అమ్ముడైపోయాయి. కాగా, మంగళవారం ఉదయం వెస్టిండీస్ జట్టు, సాయంత్రం భారత్ జట్టు నెట్ ప్రాక్టీస్ చేయనున్నాయి.

చిత్రం..విశాఖలోని హోటళ్లకు చేరుకుంటున్న భారత్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ