క్రీడాభూమి

అమ్మానాన్నలైన సానియా, షోయబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ జంట తల్లిదండ్రులయ్యారు. మంగళవారం సానియా పండంటి కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఆనంద, అపురూప క్షణాలను షోయబ్ మాలిక్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తల్లీకొడుకులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నాడు. సానియా, షోయబ్ జంట తల్లిదండ్రులయ్యారని తెలుసుకున్న అభిమానులు వీరిని ప్రశంసలతో ముంచెతుతున్నారు. సానియా-షోయబ్ 2010 ఏప్రిల్ 12న పెళ్లిచేసుకున్నారు. తాను తల్లికాబోతున్నట్టు సానియా ఈ ఏడాది ఏప్రిల్ 23న ధృవీకరించింది. 31 ఏళ్ల సానియా తమకు ఎవరు పుట్టినా తమ ఇద్దరి ఇంటిపేర్లు కలసి వచ్చేలా పేరు పెడతామని అప్పట్లోనే స్పష్టం చేశారు. డబుల్స్‌లో మాజీ వరల్డ్ నెంబర్ వన్ అయిన సానియా 2017 అక్టోబర్ నుంచి ఆటకు దూరంగా ఉంది. అయితే, 2020 టోక్కో ఒలింపిక్స్‌లో మళ్లీ బరిలోకి దిగుతానని ఆమె స్పష్టం చేసింది. డబుల్స్‌లో ఆరు గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ అందుకున్న సానియా 2015లో మార్టినా హింగిస్‌తో కలసి వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడింది. 2005లో మహిళల సింగిల్స్‌లో డబ్ల్యూటీఏ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.