క్రీడాభూమి

10వేల క్లబ్‌లో చోటుకు ఒక్క పరుగు దూరంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా క్రికెటర్-వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ వనే్డలలో 10వేల క్లబ్బులో చేరడానికి కేవలం ఒకే ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. వాస్తవానికి ధోనీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటికే 10,173 పరుగులు చేశాడు. (ఆఫ్రికా ఎలెవెన్‌తో 2007లో ఆసియా ఎలెవెన్ తరఫున ప్రాతినిధ్యం వహించినపుడు 174 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డు సాధించాడు). అయితే, లోవర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగుతున్న ధోనీ వనే్డలలో 10వేల క్లబ్బులో చేరడానికి ఇంకా ఒక్క పరుగు చేస్తే చాలు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశాఖపట్టణంలో వెస్టిండీస్-్భరత్ మధ్య జరిగిన రెండో వనే్డలో 10వేల క్లబ్బులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. 29 ఏళ్ల కోహ్లీ 205 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించడం ద్వారా దిగ్గజ ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ తెండూల్కర్ 2001లో 259 ఇన్నింగ్స్‌లో సాధించిన రికార్డును అధిగమించాడు. ఇపుడు ధోనీ సైతం గురువారం నాటి ఆఖరి వనే్డలో ఒక్క పరుగుతో వనే్డలలో టీమిండియా తరఫున 10వేల క్ల బ్బులో చేరిన ఐదో ఆటగాడిగా, ప్రపంచ స్థాయిలో 13వ క్రికెటర్‌గా నిలుస్తాడు.