క్రీడాభూమి

ఐపీఎల్‌కు న్యూజిలాండ్ క్రికెటర్లు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 12: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పూర్తిస్థాయిలో ఆడేందుకు తమ దేశ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారని న్యూజిలాండ్ క్రికెట్ జనరల్ మేనేజర్ (కమర్షియల్) జేమ్స్ వియర్ తెలిపాడు. ఐపీఎల్ ప్రసార హక్కులను అధికారికంగా పొందిన స్పోర్ట్స్ స్టార్ సోమవారం ఇక్కడ నిర్వహించిన ఒక ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నాడు. వచ్చే సీజన్‌లో ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం నుండి ముగిసేవరకు తమ ఆటగాళ్లు రెడీగా ఉన్నారని స్పష్టం చేశాడు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మ్యాచ్‌ల ద్వారా అపారమైన అనుభవం గడించిన తమ కుర్రాళ్లు ఐపీఎల్‌లో చోటు దక్కడం గొప్పవిషయమని పేర్కొన్నాడు. జేమ్స్ వియర్ తాజా ప్రకటనతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపీఎల్-12వ సీజన్‌లో ఆడనున్నారు. అయితే, ఈ రెండు దేశాల ఆటగాళ్లు వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ కప్‌లో ఆడేందుకు అవకాశం లేదన్న మీడియా వార్తలు జేమ్స్ ప్రకటనతో పటాపంచలైనట్టే.